Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ల నిరసనలు 12వ రోజు కొనసాగాయి. కార్మికశాఖ శనివారం ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశానికి స్విగ్గీ కంపెనీ ప్రతినిధులు హాజరు కాలేదు. కంపెనీ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆహారాన్ని సరఫరా చేసే సిబ్బందికి తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ వారు ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. నిరసనల సందర్భంగా యాప్ బేస్డ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ, స్విగ్గీ యాజమాన్యం వర్కర్ల మద్య ఐక్యతను దెబ్బతీసేందుకు పోలీసులకు ఫిర్యాదులు, ఉద్యోగాల తొలగింపు వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.