Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా టూరిజం అభివృద్ధి కోసం విశేష సేవలందించిన సంస్థలకు వివిధ విభాగాల్లో అవార్డులను అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కరోనా వల్ల ప్రపంచ పర్యాటక రంగం తీవ్రంగా నష్ట పోయిందని తెలిపారు. లాక్డౌన్ కాలంలో సైతం విదేశీ టూరిస్టులకు హౌం క్వారంటైన్లో హైదరాబాద్లోని హౌటళ్లు, రాష్ట్ర టూరిజం శాఖ ప్రముఖ పాత్ర పోషించాయని గుర్తు చేశారు. కష్ట కాలంలో సైతం టూరిజం అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని తెలిపారు. కాళేశ్వరం, మేటిగడ్డ, అన్నారం, మిడ్మానేరు, కోయిల్ సాగర్, కరివేణ, ఉద్దండపూర్, లక్నవరం లాంటి రిజర్వాయర్లను టూరిస్టు స్పాట్లుగా తీర్చి దిద్దుతున్నట్టు వివరించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని టూరిజం - గ్రామీణాభివృద్ధిపై సంబంధిత సంస్థలతో వెబినార్ నిర్వహిస్తున్నామని చెప్పారు.