Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ ప్రకటించిన టీఆర్ఎస్ సర్కారు, ఇక ముందు రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచాలని నిర్ణయిం చింది. ఈమేరకు శనివారం అధికారికంగా ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు కార్యాలయం జారీచేసిన ప్రకటనే ఇందుకు అవకాశం కల్పిస్తున్నది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దారుణంగా పడిపోయిందనీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అది నెమ్మదిగా పుంజుకుంటున్నా, ప్రభుత్వ అవసరాలకు సరిపో వడం లేదని ప్రగతిభవన్ అంచనాగా ఉంది. ఆదా యం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్న ప్రభు త్వం, తాజా రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచాలని కూడా నిర్ణయించింది. ఈ ఛార్జీలు ఇక ప్రాంతాల వారీగా కాకుండా, సర్వే నెంబర్ల వారీగా పెంచేందుకు సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ప్రజల గుండెలు గుభేల్మంటున్నాయి. ఆందోళనకు కారణమవుతు న్నాయి. ఇప్పటికే లాక్డౌన్ పుణ్యమాని ఉపాధి అవ కాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. నగరాలు, పట్టణాల నుంచి సామాన్య ప్రజానీకం గ్రామాలకు తరలివెళ్లిపోయారు. అక్కడ వ్యవసాయం, ఇతర కూలీ పనులు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి గ్రామాల్లో ఉండిపోయారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం ద్వారా మరోసారి మధ్యతరగతి ప్రజలు, ఇతరులపై మరోసారి ఆర్థిక భారాలు మోపే ప్రయత్నం చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేని మాట వాస్తవమే అయినా, సామాన్యుల నుంచి నిధులను రాబట్టాలని చూడటంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి నిరసన వ్యక్తమవు తున్నది. తాజాగా సీఎం నిర్ణయంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలపేర వడ్డన ఖాయమనేది తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ, ఐజీఎస్టీతోపాటు ఇతర సాధారణ నిధులను రాబట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, సాధారణ జనంపై ఛార్జీల భారం మోప డంపై రానున్న కాలంలో విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలపై ప్రేమాభిమానాలు ఉంటే ఎల్ఆర్ ఎస్ ఉచితంగా చేయాలని రాజకీయపార్టీలు, వామ పక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. ఇదిలావుండగా రానున్న కాలంగో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం జరగనున్నాయి.ఈ తరుణంలో ఎల్ఆర్ఎస్ పథకం వద్దనీ శ్రేణులు ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సూచించినట్టు తెలిసింది. అది అలా ఉండగానే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీల పేర సీఎం చేసిన ప్రకటన ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదని సమాచారం. సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు నిర్ణయించడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఖజనాలో నింపుకోవాలని ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు సమాచారం.