Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్ ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ నుంచి కర్నాటక, మహారాష్ట్రకు బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీకి అనుమతి మంజూరు చేసింది. సోమవారం వీటికి సంబంధించిన కార్యకలాపాలకు శ్రీకారం చుడతారు. ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ తర్వాత ఏపీ, తెలంగాణ సర్వీసులపై నిర్ణయం తీసుకుంటారు. ముంబయి, పూణే గుల్బర్గా, నాందేడ్, బీదర్ మార్గాల్లో తొలుత సర్వీసులు నడుస్తాయి. కర్నాటకలో బెంగళూరు మినహా మిగతా ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. గ్రేటర్ హైదరా బాద్లో పరిమిత సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయి. మార్చి 22న జనతా కర్ఫ్యూ, తర్వాత లాక్డౌన్తో బస్సులు రాకపోకలు నిలిచిపోయిన విషయం విదితమే. తాజాగా ప్రభుత్వం సిటీ బస్సులకు అనుమతి ఇవ్వడంతో కొవిడ్ - 19 నిబంధనలను పాటిస్తూ 25 శాతం బస్సులను శుక్రవారం ప్రారంభించారు. కండక్టర్, డ్రైవర్లకు వ్యక్తిగతంగా ఒక్కొక్కటి చొప్పున శానిటైజర్ బాటిళ్లు ఇచ్చారు. మాస్కు ఉంటేనే ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతిస్తున్నారు.