Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మంది మృతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2239 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ణారణ అయింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు 1,83,866 మంది వైరస్ బారిన పడగా, అందులో 1,52,441 మంది కోలుకున్నారు. మరో 30,334 మంది చికిత్స పొందుతున్నారు. కాగా 11 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, మొత్తంగా వారి సంఖ్య 1091కు చేరింది. మరో 882 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా 58,925 మందిని పరీక్షిస్తే అందులో 3.79 శాతం మందిలో వైరస్ బయటపడింది. ప్రతి 10 లక్షల మంది జనాభాకుగాను 75,438 మందికి మాత్రమే టెస్టులు చేయగలిగారు.