Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు : డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పోలీసు అమరవీరుల వారోత్సవాలను అక్టోబర్21 నుంచి 31వ తేదీ వరకు పోలీసు ఫ్లాగ్ డే పేరిట ఘనంగా నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారుల సమా వేశంలో నిర్ణయించారు. శనివారం తన కార్యాల యంలో సీనియర్ పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సమావేశమయ్యారు. విధినిర్వహణలో అమరు లైన పోలీసుల సంస్మరణార్థం నిర్వ హించే ఫ్లాగ్డే వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు డీజీపీ తెలిపారు. విద్యార్థులు మొదలుకుని ఆసక్తి గల వారికి వ్యాసరచన, వక్తృత్వం, చిత్ర లేఖన పోటీలను ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించినట్టు మహేందర్రెడ్డి తెలి పారు. ఇక పోలీసు శాఖలో విధినిర్వహణ లో అంగవైకల్యం పొందిన పోలీసులు మొదలుకుని పదవీ విరమణచేసిన వారికి ఆర్థిక సహాయం చేసేందుకు గాను ఫ్లాగ్డే ఫండ్స్ను సేకరించాలని నిర్ణయించడం జరిగిందన్నారు.. అదనపు డీజీలు గోపికృష్ణ, శివధర్రెడ్డి ,అబిలాషబిస్త్, గోవింద్ సింగ్, జితేందర్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్, నగర సీపీలు అంజీనీ కుమార్, సజ్జనార్, మహేష్భగవత్ పాల్గొన్నారు.