Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ నిర్ణయం
- అదే రోజు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
- డాక్యుమెంట్ రైటర్లకు అధికారిక లైసెన్స్లు
- అధికారులతోపాటు వారికీ శిక్షణ
- సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ల రేట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి ఆన్లైన్ పోర్టల్ను వచ్చే దసరా పండుగ రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. విజయదశమి రోజున ప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ను ఆరోజు ప్రారంభించ నున్నారు. ఇందుకు అవసరమైన అన్నీ ఏర్పాట్లను ఈ లోపుగానే పూర్తి చేయాలని ఉన్నతా ధికారులను ఆదేశించారు. అలాగే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, బ్యాండ్ విడ్త్ను సిద్ధం చేయాలని సూచించారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యూటేషన్ చేయడం, ధరణి పోర్టల్కు వివరాలను అప్లోడ్ చేయడం తదితర అంశాలు, విధివిధానాలపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్రిజిస్ట్రార్లకు అవసరమై న శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడించారు. డెమో ట్రయళ్లను కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రతి మండలం తో పాటు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఒకరి చొప్పున కంప్యూ టర్ ఆపరేటర్ల నియోమకాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారం భం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించను న్నట్టు సీఎం ప్రకటించారు. ఇక ముందు అదే రేట్ల ప్రకారం రిజిస్ట్రే షన్లు జరుగుతాయని చెప్పారు. తహసీల్దారుతోపాటు సబ్రిజిస్ట్రార్ కార్యాలయా లలో డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి వారికి కూడా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలియజేశారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్లో ఎంటర్ చేయాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత జరిగే మార్పులు, చేర్పులు వెనువెంటనే నమోదు చేయడం జరుగుతుందన్నారు. దసరా రోజున పోర్టల్కు శ్రీకారం చుడుతున్న కారణంగా అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతాయని సీఎం తెలియజేశారు. ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని స్పష్టం చేశారు.