Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గత 15రోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపో యిన ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లడమేకాక అనేక మంది మరణించారని గుర్తు చేశారు. భారీ సంఖ్యలో ఇండ్లు కూలాయనీ, నివాస యోగ్యంగా లేని పరిస్థితుల్లో సామాన్య ప్రజలు నిర్వాసితులుగా గ్రామాల నుంచి బయటకు వచ్చారని చెప్పారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి మూడు అడుగుల నీరు చేరిందనీ, దీంతో బయటికి రాలేని పరిస్థితి ఏర్ప డింద న్నారు. వర్షాలు, వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయ న్నారు. వేలాది ఎకరాలు వారం రోజులుగా నీట మునిగి ఉన్నాయనీ, పిడుగులు పడి, వరదల్లో కొట్టు కపోయి జనం మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వానల మూలంగా సాధారణ జనజీవ నానికి తీవ్ర అంతరాయం కలిగిందని వివరించారు. నిర్వాసి తులకు శిబిరాలు ఏర్పాటు చేయడం, చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వడం, పంటలు నష్టపోయిన రైతుల గణాంకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం తోపాటు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. పంటల నుంచి నీరు వెళ్ళిన తరువాత మళ్లీ పంటలు వేయటానికి రైతులకు విత్త నాలు, ఎరువులు, రుణాలు విరివిగా అందుబాటులోకి తేవాలని కోరారు. ఇండ్లు కూలిపోయిన వారికి తక్షణ సహాయంగా పునరావాసం, ఇతరసౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ, ఇందుకు తగిన నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాలు వలకు గండ్లు పడకుండా, చెరువులు తెగకుండా అవసరమైన అన్నీ చర్యలూ చేపట్టాలని సూచించారు. గత ఐదేండ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క వ్యవసాయ రంగానికే రూ.29,500 కోట్ల నష్టం జరిగిందనీ, కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ద్వారా చేసిన సహాయం రూ.2900 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీగా వర్షాలు కురిసే అవకాశముం దంటూ వాతావరణ శాఖ చెబుతున్నదనీ, దీంతో రాష్ట్రం పరిస్థితి మరింత ఆధ్వానంగా మారే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. హుస్సేన్ సాగర్, హిమాయత్సాగర్ నీటిని క్రమేణా విడుదల చేయాలని కోరారు. ఈనేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలుగా పట్టణాలు, గ్రామాల్లోనూ సహాయక చర్యలు చేపట్టాలనీ, నష్ఠపోయిన వారికి పరిహారం చెల్లించి అన్నీ విధాలుగా ఆదుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.