Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ టీఎమ్యూ కేంద్ర కమిటీ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎమ్యూ)లో ఎలాంటి నాయకత్వ మార్పు లేదని ఆ సంఘం అధ్యక్షులు వి తిరుపతి తెలిపారు. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన టీఎమ్యూ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అశ్వత్థామరెడ్డి నాయకత్వంపై కమిటీ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించిందని వివరించారు. టీఎమ్యూలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తదనంతరం పరిణామాలు, కరోనా పరిస్థి తుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర కమిటీ సమీక్షించి నట్టు తెలిపారు. సీఎం ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికా రులు కార్మికులపై చేస్తున్న దాడిని యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఆర్టీసీలో ఉద్యోగుల తొలగింపు ఉండదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారనీ, కానీ ఇప్పటికీ ఉద్యోగ భద్రతపై గైడ్లైన్స్ ఇవ్వక పోవడం శోచనీయమని అన్నారు. వందల మంది కార్మికులను డిపోస్పేర్ పేరుతో ఉద్యోగం లేకుండా నెలల తరబడి సతాయిస్తున్నరని తెలిపారు ఆర్టీసీలో యూని యన్ కార్యకలాపాల మీద విధించిన అప్రకటిత నిషేధం ఎత్తి వేసి, కార్మికులపై జరుగుతున్న దాడికి ముగింపు పలకాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.