Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ కెఎంకె రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పొగాకు వాడకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 80 లక్షల మంది మరణిస్తున్నారని కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ కెఎంకె రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రపంచ గుండె దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో సీఎస్ఐ కోశాధికారి డాక్టర్ శ్రీధర్రెడ్డి, గౌరవ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ గార్గ్, ప్రెసిడెంట్-ఎలెక్ట్ డాక్టర్ నరసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ మరణిస్తున్న వారిలో 60 లక్షల మంది నేరుగా పొగాకును వాడుతుండగా, మరో 20 లక్షల మంది ఇతరుల పీల్చి వదిలిన సిగరెట్ పొగ కారణంగా చనిపోతున్నారని వివరించారు. కాల్చే ప్రతి సిగరెట్ వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం 5.6 శాతం పెరుగుతున్నదన్నారు. వీటితో కొలెస్ట్రాల్, మధుమేహం కూడా గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని వివరించారు. అధిక రక్తపోటు కారణంగా ప్రతి నలుగురు పురుషులలో ఒకరు, ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ప్రమాదాల బారిన పడుతున్నారని గుర్తు చేశారు.
పొగతాగడం, మద్యం సేవించడం, కొవ్వు పదార్థాలను, జంక్ఫుడ్ను తీసుకోకుండా నిశ్చలమైన జీవనశైలిని అలవర్చుకోవాలని డాక్టర్ రెడ్డి సూచించారు. చక్కటి హదయ ఆరోగ్య అలవాట్లు అంటే వ్యాయామం చేయడం, సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు తగినంత తాగడం, తాజా పండ్లు తినడం, యోగా, ధ్యానం చేయాలని సలహా ఇచ్చారు. వారానికి ఐదు రోజులు కనీసం అరగంట చొప్పున నడవాలని సూచించారు.