Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మంది మృతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 1967 మందికి కరోనా పాజిటివ్గా నిర్ణారణ అయింది.శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు 1,85,833 మంది వైరస్ బారిన పడగా, అందులో 1,54,499 మంది కోలుకున్నారు. మరో 30,234 మంది చికిత్స పొందుతున్నారు. కాగా తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, మొత్తంగా వారి సంఖ్య 1100కు చేరింది. మరో 1520 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా 50,108 మందిని పరీక్షిస్తే అందులో 3.79 శాతం మందిలో వైరస్ బయటపడింది. ప్రతి 10 లక్షల మంది జనాభాకుగాను 76,788 మందికి మాత్రమే టెస్టులు చేయగలిగారు.
ఐదు జిల్లాల్లో వందకుపైగా...
రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో వందకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 297 ఉన్నాయి. కరీంనగర్ 152, రంగారెడ్డి 147, మేడ్చల్-మల్కాజిగిరి 137, నల్లగొండ 105 కేసులు వచ్చాయి. అతి తక్కువగా నారాయణపేట్ ఎనిమిది, కొమురంభీం ఆసిఫాబాద్ 15, ఆదిలాబాద్లో 17 కేసులను నిర్ధారించారు.