Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్నగర్లో మైనర్ బాలిక నాజియా బేగంపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన టీఆర్ఎస్ నేత మధుయాదవ్ను కఠినంగా శిక్షించాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆదివారం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ అబ్బాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా కేసును నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చిలుకూరు గ్రామానికి చెందిన నాజియా బేగం తల్లి చనిపోవడంతో తన సోదరితో కలిసి బతుకుదెరువుకోసం టీఆర్ఎస్ నాయకుడు మధుయాదవ్ ఇంట్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. పేదరికం, తల్లి లేకపోవడం, తండ్రి సరిగా పట్టించుకోకపోవడాన్ని ఆసరా చేసుకొని నాజీయా బేగం జీవితాన్ని నాశనం చేశాడని తెలిపారు. ఏం చేసినా అడిగేవారు లేరన్న ధైర్యంతో నాజీయా బేగంపై అత్యాచారానికి పాల్పడి, విషయం బయటకు వస్తుందని భావించి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హౌం మంత్రి వెంటనే కలుగజేసుకుని బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.