Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అధిక వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగానికి, ఇండ్లు కోల్పోయిన ప్రజలకు వెంటనే పరిహారం కోసం నిధులు విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఆదివారం సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 12 నుంచి 18 వరకు పడిన వానలకు 3.30 లక్షల ఎకరాల్లో వరి, పత్తి జోన్న, సోయా, కూరగాయలు, ఉల్లి, మిరప ,మొక్కజోన్న, పండ్ల తోటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అనేక మంది ఇండ్లు కూలిపోయాయనీ, వరదల్లో కొట్టుకుపోయిన మరణించిన వారికి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. రానున్న మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయనీ, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఇంత నష్టం జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నష్టం ప్రాంతాలను పరిశీలించడంగానీ, సమాచారం సేకరణగానీ చేయలేదని తెలిపారు. పంట నష్ట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి కేంద్ర బృందాన్ని రప్పించడంలో చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో అనేక సార్లు ప్రకృతి వైఫరీత్యాల వల్ల జరిగిన నష్టానికి కేంద్రాన్ని కోరడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదన్నారు. రాష్ట్రంలో నష్టాలు జరిగినప్పటికీ బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగాపెడుతున్నదని తెలిపారు. 2014 నుంచి నేటికి రూ 29వేల కోట్ల పంటల నష్టం వాటిల్లినప్పటికీ, 14, 15వ ఫైనాన్స్ కమిషన్లు రూ 3,100 కోట్లు మాత్రమే మంజూరు చేశాయని తెలిపారు. 2015-16లో అదనంగా రూ 791 కోట్లు మాత్రమే సహాయం చేసిందని గుర్తు చేశారు.