Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతం గా పరిష్కరించాలనే సంక ల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెవెన్యూ సమస్యలపై సోమవారం ప్రగతిభవన్లో మంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరిం చేలా.. ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నా మన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు
చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదన్నారు. ఆస్తుల నమోదుకు సంబంధించి దళారులను నమ్మొద్దన్నారు. ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేవాదాయ, వక్ఫ్, పరిశ్రమలు తది తర భూముల్లో వివాదాల వల్ల యాజమాన్యపు హక్కు లేని భూముల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కషి చేస్తున్నదన్నారు. జీవో నంబర్ 58, 59 ద్వారా ప్రభుత్వ భూములు, ఎలాంటి వివాదాలు లేని స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేెసిన విషయాన్ని గుర్తు చేశారు. మిగతా సమస్యలు పరిష్కారానికి కూడా ప్రణా ళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సమీక్ష సమావేశానికి విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ గొంగిడి సునీతారెడ్డి , ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని శాస నసభ్యులు గ్యాదరి కిశోర్కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్ ,చిరుమర్తి లింగయ్య, ఎన్.భాస్కర్రావు తో పాటు మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.