Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూరాలలో 26, శ్రీశైలంలో 10 గేట్లు..
- కొనసాగుతున్న వరద ప్రవాహం
నవతెలంగాణ - నాగార్జునసాగర్
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో సాగర్ 20 గేట్లు 20అడుగుల మేరకు ఎత్తి 5,15, 860 క్యూసెక్కుల నీటిని దిగువకు విడు దల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం 28,258 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 8680, ఎడమ కాల్వ ద్వారా 3949, ఎస్ఎల్బీసీ ద్వారా 1800, లోలెవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కులు మొత్తంగా 6,03,423 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు 2,58,018 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ 10 గేట్లు 25 అడుగుల మేరకు ఎత్తి 5,20,427 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.80 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఇది 201.7210 టీఎంసీలకు సమానం.