Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాబ్రీమసీదు కూల్చివేత పై తీర్పు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం
- శాంతిభద్రతల విషయంలో బీకేర్ఫుర్ : కేంద్ర హోంశాఖ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
బాబ్రీమసీదు కూల్చివేత పై బుధవారం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లు మొదలుకుని మత పరంగా సున్నితమైన ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలతో పికెట్లను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు లో వెలువడే అంశాలపైనే ఇటు బీజేపీ అటు ఎంఐఎం వర్గాలు వాటి అనుబంధ సంస్థల ప్రతిస్పందన ఉండే అవకాశం ఉన్నదని అధికారులు అనుమానిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అలర్ట్గా ఉండాలని యూనిట్ హెడ్స్ను డీజీపీ హెడ్క్వార్టర్స్ ఆదేశించినట్టు తెలిసింది. సుప్రీం తీర్పును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణను కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. ఈవిషయమై డీజీపీ మహేందర్రెడ్డి నవ తెలంగాణతో మంగళవారం మాట్లాడుతూ అయోధ్య వివాదం సమసి పోయినందు వల్ల ప్రస్తుతం శాంతి భద్రతల పరంగా వివాదం తలెత్తుతుందని భావించడం లేదని అయినప్పటికీ తాము అలర్ట్గా ఉన్నామని తెలిపారు.