Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది మంది మృతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2072 మందికి కరోనా పాజిటివ్గా నిర్ణారణ అయింది. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు 1,89,283 మంది వైరస్ బారిన పడగా, అందులో 1,58,690 మంది కోలుకున్నారు. మరో 29,477 మంది చికిత్స పొందుతున్నారు. కాగా తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, మొత్తంగా వారి సంఖ్య 1116కు చేరింది. మరో 790 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలావుండగా 54,308 మందిని పరీక్షిస్తే అందులో 3.81 శాతం మందిలో వైరస్ బయటపడింది.