Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరోనాను సైతం లెక్క చేయకుండా రైతులు పండించిన పంటను ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టాలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, రాష్ట్ర చైర్మెన్ అన్వేష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంట చేతికొచ్చే సమయంలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిం చడం లేదని విమర్శించారు. మంగళవారం గాంధీభవన్లో వారు విలేకర్లతో మాట్లాడారు. మరోవైపు కేంద్రం కఠినమైన వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులకు ఊరితాడు బిగించిందని ఆరోపిం చారు. పంట నష్టంపై ప్రభుత్వం సర్వే చేయించి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆ వార్తల్లో నిజం లేదు : జగ్గారెడ్డి
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ సీఎల్పీ సమావేశంలో తనకు వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. తనపై మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం సరైందికాదన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
5న భూసంస్కరణలపై సదస్సు : వీహెచ్
పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 5న భూసంస్కరణలు అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్గౌడ్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సదస్సులో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ప్రసంగిస్తారని ఆయన వెల్లడించారు.