Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరిరోజు 80.15 శాతం మంది హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-2020 ఆన్లైన్ రాతపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి చివరిరోజు మంగళవారం 39,506 మంది దరఖాస్తు చేయగా, 31,666 (80.15 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలు ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి ఈనెల 28,29 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు.