Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్తతో కలిసి పోలీసుస్టేషన్కు..
నవతెలంగాణ వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ పట్టణంలో ఆదివారం సాయంత్రం కిడ్నాప్కు గురైన యువతి కేసు సుఖాంతం అయింది. భర్తతో కలిసి ఆమె పోలీసుస్టేషన్కు వచ్చింది. భార్యాభర్తలిద్దరం కలిసి ఉండటం కోసమే తాము కిడ్నాప్ ప్లాన్ వేసుకున్నట్టు మంగళవారం పోలీసులు ముందు ఒప్పుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ నారాయణ వివరించారు.
దీపిక, ఖలీల్ అలియాస్ దిలీప్ నాలుగేండ్ల కిందట వివాహం చేసుకున్నారు. యువతి పుట్టింటి వారికి పెండ్లి ఇష్టం లేకపోవడంతో తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంది. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు ఆమెతో విడాకులకు ఆప్లరు చేయించారు. ఇది దీపికకు ఇష్టం లేకపోవడంతో పారిపోవాలని నిర్ణయించుకుంది. భర్తతో కలిసి కిడ్నాప్కు ప్లాన్ వేసింది. మూడ్రోజుల కిందట షాపింగ్కు వెళ్లిన ఆమెను దిలీప్ కారులో తీసుకెళ్లాడు. అనంతరం హైదరాబాద్ నుంచి సిద్దిపేట్కు వెళ్లారు. ఈ క్రమంలో దీపిక తల్లిదండ్రులు తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తాను క్షేమంగా, భర్తతో కలిసి ఉన్నానని పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. దీంతో సీఐ రాజశేఖర్ అక్కడికి వెళ్లి వీరిని తీసుకొచ్చారు. కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం యువతి చెప్పే స్టేట్మెంట్ను బట్టి మిగతా విచారణ చేపడుతామని ఎస్పీ తెలిపారు.