Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆరెకటికలకు ఇవ్వాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కరోనా సంక్షోభం వల్ల ఆరెకటిక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వృత్తి కోల్పోయి ఇల్లు గడువక వనపర్తి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. కరోనా కష్ట కాలంలో ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం, కేరళ రాష్ట్రంలాగా 16 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని కోరారు.