Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 43,300 మంది అభ్యర్థుల దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ ఆన్లైన్ రాతపరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు ఎడ్సెట్ కన్వీనర్ టి మృణాళిని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలు గురువారం నుంచి శనివారం వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 43,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 10,339 మంది అబ్బాయిలు, 33,041 మంది అమ్మాయిలు ఉన్నారు. అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. వారు మాస్క్, గ్లవ్స్, శానిటైజర్, వాటర్బాటిల్తో పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని కోరారు. సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి 90 నిమిషాల ముందే రావాలని సూచించారు.