Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆసియాస్ బెస్ట్ అండర్ ఏ బిలియన్'లో చోటు
హైదరాబాద్ : పంటలకు నాణ్యమైన హైబ్రిడ్స్ అభివద్ధి చేయడం కోసం పటిష్టమైన ఆర్అండ్డీ కలిగిన కావేరీ సీడ్స్కు ఈ ఏడాది ఫోర్బ్స్ 'ఆసియాస్ బెస్ట్ అండర్ ఏ బిలియన్' జాబితాలో చోటు దక్కింది. ఒక బిలియన్ డాలర్ల (రూ.7500 కోట్లు)లోపు ఆదాయం కలిగి, స్ధిరమైన వద్ధిని సాధిస్తున్న 200 ఆసియా-ఫసిఫిక్ పబ్లిక్ కంపెనీలను ఈ జాబితాలో గుర్తించినట్లు కావేరి సీడ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. జివి భాస్కర్ రావు 1976లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ప్రస్తుతం హైబ్రిడ్ సీడ్స్లో అగ్రశ్రేణి వ్యవసాయ కంపెనీగా కొనసాగుతుంది. ఫోర్బ్స్ ఆసియాస్ బెస్ట్ అండర్ ఏ బిలియన్ జాబితాలో గతంలో ఐదుసార్లు అంటే 2010,2011, 2012, 2013, 2015లో నిలువడంతో పాటుగా ఇప్పుడు ఆరోసారి 2020లో మరో మారు చోటు దక్కించుకున్నట్టు ఆ సంస్థ పేర్కొంది.