Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్/వరంగల్
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్ ఈనెల 30న(బుధవారం), అక్టోబర్ 1వ తేదీల్లో జరగనుంది. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఉన్నతా విద్యామండలి ప్రకటించింది. పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 58, 452 అభ్యర్థులు హాజరు కానున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 14 ప్రాంతీయ కేంద్రాలు, 70 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 30 వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబర్ 1న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్క్ ధరించి శానిటైజర్ బాటిల్తో పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలనీ, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని కన్వీనర్ ఆచార్య రాజిరెడ్డి తెలియజేశారు. బయోమెట్రిక్ ద్వారా కాకుండా ఫొటో క్యాప్చర్ విధానంతో అభ్యర్థుల హాజరును నమోదు చేస్తామని తెలిపారు. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పెన్ను తెచ్చుకోవాలని ఆయన సూచించారు.