Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళ పల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, ఎస్ఐ డి.నిహారిక తెలిపిన వివరాల ప్రకారం.. కదురు రాజు(33) తన రెండెకరాల భూమితో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పైరు మొత్తం దెబ్బతిని, పంట చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో సాగు పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలోనని రాజు మదనపడ్డాడు. వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు తండ్రి కదురు రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.