Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ ఆన్లైన్ రాతపరీక్షలు గురువారం నుంచి శనివారం వరకు జరగనున్నాయి. ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 43,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 10,339 మంది అబ్బాయిలు, 33,041 మంది అమ్మాయిలు ఉన్నారు. అభ్యర్థులు మాస్క్, గ్లవ్స్, శానిటైజర్, వాటర్బాటిల్తో పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని అధికారులు సూచించారు.
సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తున్నారు.