Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొండి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ)/ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) ప్రవేశాల కోసం నిర్వహించే డీసెట్-2020 ఆన్లైaన్ రాతపరీక్ష ఈనెల 4న జరుగనుంది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ కృష్ణారావు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డీసెట్కు తెలుగు మాధ్యమానికి 5,901 మంది, ఇంగ్లీష్ మాధ్యమానికి 6,681 మంది, ఉర్దూ మాధ్యమానికి 1,454 మంది చొప్పున 14,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. 25 పరీక్షా కేంద్రాలను కేంటాయించామని పేర్కొన్నారు. రెండు విడతల్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.