Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన వ్యవసాయ చట్టం రైతులకు ఉరితాడులాంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో ఆపార్టీ రాష్ట్ర కార్య దర్శివర్గ సమావేశం జరిగింది. అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినా వ్యవసాయ బిల్లును పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించడం దుర్మార్గమని తెలిపారు. ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై మరింత భారం మోపిందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంటిపన్ను మినహాయించండి
రాష్ట్ర, జిల్లా, మండల, బస్తీ/గ్రామస్థాయి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాలకు మున్సిపల్, గ్రామ పంచాయతీలు విధించే ఇంటి పన్ను మినహాయించాలని సీపీఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం లేఖ రాశారు. రాజకీయ పార్టీల ఇంటిపన్నులనుంచి మినహాయింపు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.