Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తనపై లైంగికదాడికి పాల్పడి నాలుక కోసేశారని సెప్టెంబర్ 20న మనీషా వాల్మీకి ఫిర్యాదు చేస్తే ఐదురోజుల దాకా కేసు నమోదు చేయకుండా, ఆమెకు అత్యవసర వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించిన యూపీ పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుర్రి ప్రసాద్, ఆర్.వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మనీషా మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించకుండా అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా దహనసంస్కా రాలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే ఆధిపత్య కులాలకు చెందిన నలుగురు యువకులను కాపాడేందుకు యూపీ పోలీసులు యత్నిస్తున్నారని అర్థమవుతున్నదని విమర్శించారు.