Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమకు రక్షణ కల్పించాలని వినతి
- 24 గంటల భద్రతకు పోలీసులకు సీపీ సజ్జనార్ ఆదేశం
నవతెలంగాణ- మియాపూర్(గచ్చిబౌలి)
ఇటీవల కులదురహంకార హత్యకు గురైన హేమంత్ భార్య బుధవారం అత్తామామలతో వెళ్లి సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిశారు. తమకు రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశారు. హేమంత్ హత్య కేసు విషయంలో ఇంకా కొంతమంది పేర్లు చేర్చాలని, వారంతా బయట ఉంటే తాము ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మమ్మ, నాన్న కుటుంబాల నుంచి తనకు, తమ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని తెలిపారు. అవంతి విజ్ఞప్తిపై సీపీ స్పందించారు. ఎలాంటి భద్రతైనా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. వెంటనే హేమంత్ ఇంటి వద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసులను సీపీ ఆదేశించారు. అలాగే, ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు హేమంత్ హత్య కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం చర్లపల్లి జైలు నుంచి యుగంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని గచ్చిబౌలి పీఎస్కు తరలించారు. హేమంత్ హత్యకు సంబంధించి లోతైన విచారణ చేయనున్నారు.