Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వివేకానందకు ప్రగతినగర్ కార్పొరేటర్ల వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్లోని ప్రగతినగర్లో మంజీరా, గోదావరి నీటి కొరత సమస్యను పరిష్కరించాలని స్వతంత్ర కార్పొరే టర్లు డిమాడ్ చేశారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు బుధవారం ప్రగతినగర్ స్వతంత్ర కార్పొరేటర్లు రాములు, బి.వెంకటరామయ్య, లక్ష్మికుమారి, ఎం.సత్యవాణి, పైడిమాధవి, యం.సుజాత వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒప్పందం ప్రకారం రోజూ 5500కేఎల్డీ నీటిని సరఫరా చేయాలనీ, పెరిగిన జనాభాకు అనుగుణంగా అదనంగా 10,000కేఎల్డీ నీటి సరఫరా పెంచాలి కోరారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి 1.50కోట్ల సామర్థ్యం కల్గిన సంపును నిర్మించాలన్నారు. అదే విధంగా స్పేర్ మోటార్స్ కొనుగోలు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. నీటి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని, సింగూరు, మంజీరా నుంచి నీటి సరఫరా అవుతుందని హామీ ఇచ్చారు.