Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు : టీపీసీసీ
- సంగారెడ్డికి మాణిక్కం ఠాగూర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసం హరించు కోవాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. ఈ చట్టాలకు నిరసన గా అక్టోంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాలని పిలుపు నిచ్చింది. సంగారెడ్డి పట్టణంలో జరగనున్న ధర్నాలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూరు పాల్గొంటారని పార్టీఅధ్యక్షులు ఉత్తమ్ పేర్కొన్నారు. రైతుల నుంచి సంతకాల సేకరణ ప్రారంభిస్తామన్నారు.
మోడీ సన్నిహిత కార్పొరేట్లదే దోపిడి
దేశ సంపదను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయన సన్నిహితులకు దోచిపెడుతున్నారని ఏఐసీసీ శిక్షణ విభాగం చైర్మెన్ సచిన్ రావు చెప్పారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోచుకున్నట్టుగానే నేడు మోడీ సన్నిహితులైన కార్పొరేట్ వ్యాపారులు దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. బుధ వారం కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ సంపద తరిగి పోతుంటే మోడీ సన్నిహితులైన గౌతమ్ ఆధాని, ముకేశ్ అంబానీల ఆస్తుల విపరీతంగా పెరుగుతు న్నాయని చెప్పారు. గౌతమ్ ఆధాని ఒక్కరోజుకు 59 కోట్లు సంపదిస్తుంటే, ముఖేశ్ అంబానీ రోజుకు 210 కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. వారి ఒక్కరోజు సంపాదన దేశంలో కోట్లాది ఉపాధి హామీ కార్మికుల దినసరి వేతనంతో సమానమని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో ప్రజల జీవన పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నా యనీ, కానీ కార్పొరేట్ వ్యాపారుల ఆదాయం విపరీతంగా పెరుగుతుందని అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలన్నారు.