Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిశువిహార్కు తరలించిన అధికారులు
నవతెలంగాణ - వంగూరు
ఏ తల్లి కన్నబిడ్డో.. ఆడపిల్లనే వివక్షనో ఏమో.. పుట్టగానే పసికందు రోడ్డు పాలైంది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామ శివారులో గుంట బావి సమీపంలో బుధవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో పసికందును వదిలేశారు. అటువైపు వెళ్లిన యువకులు ఆడబిడ్డ ఏడుపు విని గ్రామ పెద్దలకు చెప్పారు. దాంతో గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. సంచిలో ఉన్న పసికందును గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం శిశు సంవర్థక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు గ్రామానికి చేరుకున్నారు ఆ పాపను వైద్య పరీక్షల నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పసిపాప ఆరోగ్యంగానే ఉండటంతో జిల్లా శిశువిహార్కు తీసుకెళ్లారు.