Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్
నవతెలంగాణ-కామారెడ్డి
ఎన్నికల నిర్వహణలో నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ వీరబ్రహ్మయ్య అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కామారెడ్డి కలెక్టరేట్లో సమీక్షించారు. అనంతరం జనహిత భవన్లో పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందికి నిర్వహించిన పోలింగ్ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శరత్ ఏర్పాట్లపై ఆయనకు వివరించారు. కామారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో 22 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్డీవో శీను నాయక్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, అధికారులు ఉన్నారు.