Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలనీ, ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ ధర్నా నిర్వహించింది. బషీర్బాగ్ చౌరస్తాలోని విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద ఐద్వా అధ్యక్షురాలు కె.ఎన్.ఆశాలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా కూరగాయల ధరలను చూపిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. రాష్ట్రంలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు తక్షణం చర్యలు తీసుకోవాలనీ, ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వాలు ధరలను అదుపు చేయలేకపోవడం సిగ్గు...సిగ్గు, నిత్యావసర వస్తవుల ధరలను తగ్గించాలనీ, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలనీ, బాలికలు, మహిళలు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా గతంలో భద్రతనిచ్చిన చట్టాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. కరోనాకాలంలో ఉపాధి, ఆదాయం లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే నిత్యావసర వస్తువుల చట్టం ఎత్తివేయడం సిగ్గు చేయటన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలనీ, ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద, సహాయ కార్యదర్శి అరుణజ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు నాగలక్ష్మి, స్వర్ణలత, శశికళ, పద్మ షబానా, అన్నపూర్ణ, రాణి,లావణ్య తదితరులు పాల్గొన్నారు.