Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపెక్స్ కౌన్సిల్లో ఏడేండ్ల అలసత్వాన్ని ఎండగడదాం...
- ఏపీ కావాలనే కయ్యం పెట్టుకుంటున్నది : ముఖ్యమంత్రి కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు అక్టోబరు ఆరున నిర్వహించబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిలేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. ఏడేండ్ల అలసత్వంపై మోడీ సర్కార్ను ఎండగడతామని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్లో అనుసరిం చాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బుధవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో సీఎం.. నీటి పారుదలశాఖ ఉన్నతా ధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ... 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు అపెక్స్ కౌన్సిల్లో ధీటైన సమా ధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్త వాలను కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేయాలి. రాష్ట్ర ప్రజల హక్కులను హరించటానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలి. నిజా నిజాలను యావత్ దేశానికి తేటతెల్లం చేయాలి...' అని సూచించారు. 'రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాలి. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడితే అదే నెల 14న ప్రధాన మంత్రికి లేఖరాశాం. రాష్ట్రానికి నీటి కేటాంయి పులు జరపాలని కోరాం. అంతర్రాష్ట నదీ జలాల వివాదాల చట్టం- 1956 సెక్షన్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యూనల్ను ఏర్పాటు చేసిగానీ, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యూనల్ ద్వారాగాని నీటి కేటాయింపులు జరపా లని కోరాం. ఏపీ, తెలంగాణ మధ్యగానీ, లేదంటే నదీ పరివాహక ప్రాం తాల్లోని అన్ని రాష్ట్రాల మధ్యగాని నీటిని పంపిణీ చేయాలని కోరాం. ప్రధానికి లేఖ రాసి ఏడేండ్లుదాటినా ఈనాటికీ స్పందనలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూలేదు. పైగాఅపెక్స్ సమాy ేశాల పేరిట ఏదో చేస్తున్నట్టుగా వ్యవహరిస్తూ... ఏమీ చేయకుండా వదిలే స్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గట్టిగా నిలేయాలి. తెలంగాణాకు నీటి కేటాయింపుల విష యంలో స్ప ష్టత ఇవ్వాలంటూ పట్టుబట్టాలి' అని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలతో కూడిన నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.