Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
ములుగు జిల్లా మంగపేట మండలం నిమ్మగూడెం గ్రామపంచాయతీ తిమ్మాపురం ముసలమ్మగుట్ట అటవీప్రాంతం కొప్పుగుట్టలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు ఎస్పీ విక్రమ్సింగ్ గణపతి రావ్పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మావోయిస్టులు విధ్వంసం సష్టించడానికి యాక్షన్ దళాలను ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు పంపారు. ఇంటలిజెన్స్ విశ్వసనీయ సమాచారం ప్రకారం మావోయిస్టులు తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు పోలీసులపై మెరుపు దాడులు చేయడానికి వ్యూహరచన చేసుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఆదివారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట అటవీ ప్రాంతాల్లో జిల్లా ప్రత్యేక బలగాలు, గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ముసలమ్మగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులపై ఎదురుకాల్పులకు దిగారు. ఆత్మ రక్షణకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించగా, మరికొందరు పారిపోయారు. పోలీసు బలగాలు తాడ్వాయి, పస్రా, మంగపేట అటవీ ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. మృతిచెందిన మావోయిస్టులను తహసీల్దర్తో పంచనామా చేయించి మృతదేహాలను ఏటూర్నాగారం సామాజిక ఆస్పత్రికి తరలిస్తున్నట్టు తెలిసింది. కాగా ఎన్కౌంటర్ జరిగినట్టు ప్రచారం జరగడంతో పోలీసులు అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. మృతిచెందిన మావోయిస్టులు ఎవరనేది ఇంకా గుర్తించలేదని, విచారణ అనంతరం చెబుతామని ఎస్పీ తెలిపారు.
ఎన్కౌంటర్తో ఏజెన్సీ మండలాల్లో యుద్ద వాతావరణం నెలకొంది. కాగా ఎన్కౌంటర్ మృతులు మణుగూరు దళ కమాండర్ సుధీర్ దళానికి చెందిన వారని తెలిసింది. వారి వద్ద ఎస్ఎల్ఆర్ ఆయుధాలు లభించడంతో మృతుల్లో ఎవరైనా అగ్ర నాయకుడు ఉండవచ్చుననే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు భీమేశ్వరరావును మావోయిస్టులు హతమార్చిన సంగతి విదితమే. శనివారం వెంకటాపురం పోలీసులు ఆలుబాకా కొండాపూర్ బ్రిడ్జి వద్ద మావోయిస్టు మిలీషియా సభ్యుడు లక్ష్మయ్యను అరెస్ట్ చేసి 24 గంటలు గడవకముందే ఈ ఎన్కౌంటర్ జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా ఏజెన్సీలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న పోరులో ఏజెన్సీ ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో వణుకుతున్నారు.