Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు సీఎం పళనిస్వామి కేసీఆర్కు లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమైన నేపథ్యంలో... తమ వంతుగా రూ.10 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి... సీఎం కేసీఆర్కు సోమవారం లేఖ రాశారు. వరదల్లో చిక్కుకుని మరణించిన వారికి తన సంతాపాన్ని ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో వేలాది మంది పేదలు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు మిగిల్చిన విషాదం నుంచి నగరం త్వరగా తేరుకోవాలని పళనిస్వామి ఆకాంక్షించారు.