Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు లేనేలేవని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. తమ హయాంలో అలాంటి వాటికి అనుమతులివ్వలేదని తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... అక్రమ కట్టడాల గురించి కాంగ్రెస్, టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆ రెండు పార్టీల హయాంలోనే 2014 కంటే ముందు అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చారని విమర్శించారు. అప్పుడున్నవే తప్ప తమ ప్రభుత్వం ఎక్కడా అలాంటి వాటికి అనుమతులివ్వలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ చూడనంత వాన కురిసిందని చెప్పారు. ఫలితంగానే వరదలు సంభవించాయని వివరించారు.