Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి : మంత్రి ఈటల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా, సీజనల్ వ్యాధుల్లో కొన్ని లక్షణాల్లో పోలికలు ఉండడంతో తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు. సోమవారం మంత్రి రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్రెడ్డిలతో కలిసి సమీక్షించారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖలతో కలిసి పని చేయాలని వైద్యాధికారులను కోరారు. జీహెచ్ఎంసీలో 585 మెడికల్ క్యాంపు లు నిర్వహించామనీ, 104 వాహనాల ద్వారా 50 మొబైల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని డాక్టర్ శ్రీనివాసరావు మంత్రికి వివరించారు. వీటి ద్వారా 38516 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని తెలిపారు.