Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం-వరంగల్-నల్లగొండ అభ్యర్థిగా గుత్తా రవీందర్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఖమ్మం-వరంగల్-నల్లగొండ అభ్యర్థిగా డాక్టర్ గుత్తా రవీందర్రెడ్డి పేరును టీజేఏసీ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టీజేఏసీ చైర్మెన్ డాక్టర్ ఇటిక్యాల పురుషోత్తం మాట్లాడుతూ ఏ ఆకాంక్షల కోసమైతే ప్రజలు తెలంగాణ కోరుకున్నారో, వాటిని నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు సమస్యలు మిగిలాయనీ, విద్యావ్యవస్థ ధ్వంసమైందని విమర్శించారు. టీజేఏసీ కో చైర్మెన్, అభ్యర్థి గుత్తా రవీందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు లక్షల పోస్టులను భర్తీ చేయకుండా టీఆర్ఎస్ తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు లేకుండా చేసి అన్యాయం చేస్తున్నదని తెలిపారు. సమావేశంలో టీజేఏసీ హైదరాబాద్ చైర్మెన్ ఎం.వేణు, వికారాబాద్ జిల్లా చైర్మెన్ ముకుంద నాగేశ్వర్, మేడ్చల్ కో చైర్మెన్ కె.బి.నాగయ్య, జీహెచ్ఎంసీ కో చైర్మెన్ సత్యం మేడె తదితరులు పాల్గొన్నారు.