Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ రిటైల్, ఎంఎస్ఎంఈ వ్యాపారులకు రుణ మద్దతును అందించడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్ జోన్లోని బేగంపేట బ్రాంచి కార్యాలయంలో ప్రత్యేక రిటైల్, ఎంఎస్ఎంఇ క్రెడిట్ క్యాంపెయిన్ను నిర్వహించినట్టు ఆ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో గహ, వాహన, విద్య సహా రిటైల్ రుణాల కింద 50 మందికి దాదాపుగా రూ.15.65 కోట్లు మంజూరుచేశారు. అదేవిధంగా 21 ఎంఎస్ఎంఈలకు రూ.17.60 కోట్ల రుణాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఎకె మోహపాత్ర, జోనల్ మేనేజర్ ఎంబి సురేష్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ మోహపాత్ర, ఆర్ఎంపిసి హెడ్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ క్రెడిట్ పోర్ట్ఫోలియోను పెంపొందించేందుకు ఇతర శాఖల్లోనూ ఇలాంటి 'క్రెడిట్ కార్డ్' క్యాంపెయిన్ను నిర్వహించనున్నట్టు బ్యాంకు మేనేజర్లు తెలిపారు.