Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వమే మక్కలు కొనాలి:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య అధ్యక్షతన సోమవారం జరిగిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టాలను రైతులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే రైతులను ఆదుకోవాలన్నారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని, తడిసిన ధాన్యం, పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. పూర్తిగా దెబ్బతిన్న వరికి ఎకరాకు రూ.25,000, పత్తికి రూ.30వేలు, మిర్చికి రూ.40 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు వేసిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో వాటి కొనుగోలు బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని సూచించారు. పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21 నుంచి 24 వరకు మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.