Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్
జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు కదంతొక్కారు. 'ఎన్నికల వేళ దుబ్బాకలో ఇచ్చిన వారు.. మాకెందు కివ్వరు' అంటూ ఉమ్మడి మెదక్ జిల్లా కార్మికులు అధికారులను ప్రశ్నించారు. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొంతమంది చంటి బిడ్డలతో ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, బీడీ కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ పాలవెల్లి జోక్యం చేసుకొని ఉన్నత అధికారులతో మాట్లాడిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలమణి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దుబ్బాకలో జీవనభృతి మంజూరు చేశారనీ, మిగతా ప్రాంతాల్లో మాత్రం సాంకేతిక సమస్యలంటూ దాటేస్తున్నారని విమర్శించారు.