Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సాధన కోసం గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షులు ఎం రఘుశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూణ్నెళ్లలో అమలు చేస్తామన్న పీఆర్సీ 30 నెలలు కావస్తున్నా అమలు కాకపోవడం, మధ్యంతర భృతి (ఐఆర్) చెల్లించకపోవడం సరైంది కాదని తెలిపారు.