Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రాజెక్టులలో వరుస సాంకేతిక వైఫల్యాలు, భారీ ప్రమాదాలకు చోటుచేసుకుంటున్నాయనీ, ఆ ఘటనల్లో ప్రాణ, ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందాన్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు మంగళవారం లేఖ రాశారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని తిప్పాపూర్ సమీపంలో ఉన్న కాళేశ్వరం ఎల్ఐఎస్ నిర్మాణంలో ఉన్న సొరంగం పైకప్పు లోపభూయిష్ట సాంకేతిక నమూనాలు, సరైన భద్రతా చర్యలు లేని కారణంగా కూలిపోయిందనీ, ఏడుగురు కూలీలు చనిపోయారని లేఖలో పేర్కొన్నారు.