Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో ధ్రువపత్రాలు కోల్పోయిన విద్యార్థులకు కొత్తగా ధ్రువపత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలు, వరదల్లో ఇండ్లు మునిగిపోవటం, కొన్ని ఇండ్లు కూలిపోవటం వల్ల వేలాది మంది విద్యార్థుల ధ్రువపత్రాలు కోల్పోవడం, పాడైపోవడం జరిగిందని తెలిపారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిశీలించిన ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని నిర్ణయించిందని వివరించారు.
ఆ విద్యార్థులకు కొత్తగా లేదంటే డూప్లికేట్ ధ్రువపత్రాలు జారీ చేయాలని పాఠశాల, ఇంటర్, కాలేజీయేట్, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్లతోపాటు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను ఆదేశించారు. ధ్రువపత్రాలు కోల్పోయిన విద్యార్థులు వారి వివరాలతో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సంబంధిత అధికారులకు దరఖాస్తు చేయాలని సూచించారు. ఉచితంగా ఈ సేవలను అందించాలని అధికారులను కోరారు.