Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో జరగాల్సిన పరీక్షలన్నిం టినీ దసరా వరకు వాయిదా వేస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రకటిం చారు. పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడిం చారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ప్రజలు, ముఖ్యంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరో 2రోజులు వర్షాలు కురిసే అవకాశా లున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విశ్వవిద్యాలయాల పరిధిలో అన్ని పరీక్షలనూ దసరా వరకు వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.