Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మధుమేహ రోగుల సంరక్షణకు గైడింగ్ టూల్ను నోవో నోర్డిస్క్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. సగటున 51 ఏండ్లు దాటిన 300 మంది అధ్యయనంలో పాల్గొనగా వారిలో 71 శాతం మంది పురుషులు, 29 మంది శాతం మహిళలున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి భోజనం చేసిన తర్వాత గ్లూకోస్ స్థాయి 253 మిల్లి గ్రాములు, భోజనానికి ముందు 170 మిల్లి గ్రాములు ఉన్నట్టు తేలింది. దీనిపై గాంధీ మెడికల్ కళాశాల కన్సల్టెంట్ ఎండ్రోనాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.విజరుశేఖర్రెడ్డి, అధ్యయన నివేదిక చాలా సానుకూలంగా ఉందని తెలిపారు. అదనపు చర్యలు చేపడితే మధుమేహాన్ని నియంత్రించవచ్చుననీ అభిప్రాయపడ్డారు. నోవో నోర్డిక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్టీ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రధాన నగరాల్లోని మధుమేహం రోగుల్లో హెచ్ బీ ఏ1సీ స్థాయిని, ధోరణిని గుర్తించడానికి ఈ అధ్యయనం తోడ్పడిందన్నారు.