Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు మృతి
- కరోనా బులెటిన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరో 1,486 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు 2,24,545 మంది వైరస్ బారిన పడగా, అందులో 2,02,577మంది కోలుకున్నారు. మరో 20,686 మంది చికిత్స పొందుతున్నారు. కాగా మరో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, మొత్తంగా మరణాల సంఖ్య 1282కు చేరింది. మరో 923 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఇదిలావుండగా 42,299 మందిని పరీక్షిస్తే అందులో 3.51 శాతం మందిలో వైరస్ బయటపడింది. ప్రతి 10 లక్షల మంది జనాభాకుగాను 1,04,750 మందికి మాత్రమే టెస్టులు చేయగలిగారు.
మూడు జిల్లాల్లో వందకు పైగా.....
జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 235, రంగారెడ్డి 112, మేడ్చల్-మల్కాజిగిరి 102 కేసులు నమోదయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కేసు లేదు. అతి తక్కువగా నారాయణపేట 8, కొమురంభీం ఆసిఫాబాద్ 9, నిర్మల్ 14 కేసులను నిర్దారించారు.